కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.1లక్ష పరిహారం..!

| Edited By:

Jun 04, 2020 | 8:20 PM

మన భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.1లక్ష పరిహారం..!
Follow us on

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మన భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పంగా నమోదైనప్పటికీ.. గత కొద్ది రోజులుగా నిత్యం వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్. మొన్నటి వరకు అక్కడ కరోనా కేసులు అత్యల్పంగా ఉన్నప్పటికీ.. తాజాగా నమోదవుతున్న కేసులతో అక్కడి ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అంతేకాదు కరోనా సోకిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయ్యింది. కరోనా బారినపడి మరణించిన కుటుంబ సభ్యులకు రూ.1లక్ష రూపాయల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్‌ సీఎం తెలిపారు.