తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..లాక్‌డౌన్ పొడిగింపు

|

Apr 08, 2020 | 7:20 AM

దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ మేర‌కు ..

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..లాక్‌డౌన్ పొడిగింపు
Follow us on

దేశంలో విస్త‌రిస్తోన్న క‌రోనా వైర‌స్ అంత‌కంత‌కూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు ప‌దుల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. దీంతో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌నే యోచ‌న‌లో ఉన్నాయి. ఈ మేర‌కు ప‌లువురు సీఎంలు ప్ర‌ధానికి ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది.

దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ మేర‌కు మొద‌టిది..ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించాల‌ని, ఇక రెండ‌వ‌ది తెలంగాణ కోర్టులకు ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేయ‌డం. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన న్యాయమూర్తులు.. బార్ లీడర్లు, వైద్య నిపుణులతో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అనంతరం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి.