
లాక్డౌన్లో సమయంలోనూ శృతి హాసన్ దూసుకుపోతోంది. టాలీవుడ్, కోలివుడ్,శాండల్ వుడ్లో కాకుండా సోషల్మీడియాలో తన ఫాలోవర్స్ను పెంచుకుంటోంది. ఇన్ స్టాగ్రమ్ లో 14 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంత చేసుకుంది. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. తనను ఇంతలా ఫాలో అవుతున్న అభిమానులకు స్పెషల్ థాంక్స్ చేప్పింది. తనపై చూపించే ప్రేమకు కృతజ్ఞతలు అంటూ తెలిపింది.
నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ఈ భామ.. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ చిత్రంలో శృతి హాసన్ నటిస్తోంది.