ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు బుల్లి తెర స్టార్స్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ సీరియల్స్ షూటింగ్ రద్దు చేశారు.
తాజాగా మరో బుల్లితెర స్టార్కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్లో హీరోయిన్గా నటిస్తోన్న నవ్య స్వామి కోవిడ్ బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ఆమె వైరస్ టెస్టుకు వెళ్లగా పాజిటివ్ నిర్థారణ అయినట్టు సమాచారం. దీంతో ఆమె నటిస్తున్న షూటింగ్స్ రద్దు చేసినట్లు తెలుస్తుంది.
Read More:
108 ఉద్యోగులకు సీఎం జగన్ వరం.. భారీగా జీతాలు పెంపు
మారిన ఏటీఎం, బ్యాంకు, పీఎఫ్ రూల్స్ వివరాలివే..