Covid 19: షాకింగ్ న్యూస్… సీజనల్ వ్యాధిగా కరోనా !

తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో భయంకర నిజాన్ని బయపెట్టారు ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తల బ‌ృందం..వారు చేసిన ఆ ప్రకటన ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతోంది..కరోనా ఇప్పటికిప్పుడు తగ్గిపోయేది కాదు..ఇంకా చెప్పాలంటే...

Covid 19: షాకింగ్ న్యూస్... సీజనల్ వ్యాధిగా కరోనా !
Follow us

|

Updated on: Mar 04, 2020 | 10:53 AM

ప్రపంచం ఇప్పుడు కంటికి కనిపించని శత్రవుతో పోరాటం చేస్తోంది. కొవిడ్- 19 మహమ్మారి దాటికి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 80 దేశాలకు విస్తరించిన వైరస్.. 93 వేల 160 మందిని సోకినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 3 వేల 203 మంది ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇంకా వేల సంఖ్యలో వైరస్ భాదితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. ఈ క్రమంలోనే తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి మరో భయంకర నిజాన్ని బయపెట్టారు ప్రఖ్యాత క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల బృందం. ఆ ప్రకటన ఇప్పుడు మరింత కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళితే…

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 వైరస్ గురించి లండన్‌కు చెందిన క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు.  కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారి ప్రజల్ని వెంటాడుతుందని తాజా అద్యయనంలో వెల్లడించారు.  కరోనా వైరస్ ఓ సారి వచ్చి వెళ్లిపోదు…ఇది కూడా సీజనల్ వ్యాధుల్లాగానే ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. సహజంగా సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటివి కరోనా వైరస్‌ వ్యాప్తికి దోహదపడతాయని చెప్పారు. జలుబు, చెస్ట్ ఇన్‌ఫెక్షన్, స్వైన్‌ఫ్లూ లానే కరోనా కూడా శాశ్వత వైరస్ అని శాస్త్రవేత్తలు గుర్తించినట్లుగా తెలిపారు.. గత 50 ఏళ్లుగా మనందరికీ తెలిసిన వైరస్ వంటిదే కరోనా కూడా అని లండన్ సైంటిస్ట్ బ‌ృందం స్పష్టం చేసింది.

కరోనాలో సీజనల్ వ్యాధుల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, అది ఇప్పటికిప్పుడు తగ్గిపోయే లేదా అంతమైపోయే వైరస్ కాదని సైంటిస్టులు చెప్పారు. సీజనల్ ఇన్‌ఫెక్షన్ లాగా మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలు కరోనాలో చాలా ఉన్నాయని వారు వివరించారు. ఫలితంగా ప్రపంచ జనాభాలో దాదాపు 70శాతం మందికి పైగా కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని వారు హెచ్చరించారు. కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుందని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ మేరకు క్వీన్ మేరీ వర్సిటీ సైంటిస్టుల నివేదిక ఆధారంగా ప్రఖ్యాత డెయిలీ మెయిల్ లో ప్రత్యేక కథనం ప్రచురించారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!