AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియా ప్రధానితో ఆన్ లైన్ మీటింగ్.. పర్ఫెక్ట్ టైమింగ్.. మోదీ

భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 'వర్చ్యువల్ సమ్మిట్' సరైన సమయంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో..

ఆస్ట్రేలియా ప్రధానితో ఆన్ లైన్ మీటింగ్.. పర్ఫెక్ట్ టైమింగ్.. మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 12:52 PM

Share

భారత-ఆస్ట్రేలియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ‘వర్చ్యువల్ సమ్మిట్’ సరైన సమయంలో జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తో గురువారం ఆయన ఆన్ లైన్ సమ్మిట్ నిర్వహించారు. ఓ విదేశీ నేతతో మోదీ బైలాటరల్ వర్చ్యువల్ సమ్మిట్ నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. భారత, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, విలువలు, ప్రయోజనాలు, జాగ్రఫీని , లక్ష్యాలను పంచుకోవడంతో ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కి అంగీకరించినందుకు ఆయన మారిసన్ కి కృతజ్ఞతలు  తెలిపారు. మారిసన్ ఈ ఏడాది మొదట్లోనే ఇండియాను విజిట్ చేసి ఉంటే గొప్పగా ఉండేదని, అప్పుడు ఈ వర్చ్యువల్ సమ్మిట్ అంత ప్రాధాన్యత సంతరించుకునేది కాదని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి అదుపులోకి రాగానే మారిసన్ తన ఫ్యామిలీతో సహా  భారత్ ని సందర్శించాలని ఆయన కోరారు.

కాగా-ఇతర అంశాలతో సహా తమతమ మిలిటరీ స్థావరాలను పరస్పరం సన్నిహితంగా ఉంచేందుకు సంబంధించి భారత,ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒప్పందం కుదరవచ్ఛునని భావిస్తున్నారు.

ఈ మధ్యే స్కాట్ మారిసన్ చట్నీతో కూడిన సమోసాలను మోదీతో షేర్ చేసుకోవాలని ఉందంటూ సరదాగా ట్వీట్ చేసిన సంగతి విదితమే. ఇందుకు మోదీ కూడా.. ‘కనెక్టెడ్ బై ది ఇండియన్ ఓషన్..యునైటెడ్ బై ది ఇండియన్ సమోసా’ అని అదే స్ఫూర్తితో ఆయనకు ట్వీట్ చేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం