AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. సెప్టెంబర్1, 2వ తేదీల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, మీడియాకి సంబంధించిన వారికి అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి..

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 12:55 PM

Share

పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. సెప్టెంబర్1, 2వ తేదీల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, మీడియాకి సంబంధించిన వారికి అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో వెంటనే అవినాష్ రెడ్డి హోమ్ ఐసోలేషన్‌లోని వెళ్లారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా తన వెంట ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి.

ఇక ప్రస్తుతం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులు, 82 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. ఇందులో 97,681 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,12,687 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3796కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,976 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More:

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్

Follow Us