బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బాగా వేగంతో వెళ్తుండటంతో అదుపు తప్పి లారీ కిందకు...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బాగా వేగంతో వెళ్తుండటంతో అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. కర్నాటక నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్నవారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Read More:
ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్డ్