ఆరోగ్యం మెరుగు పడింది, త్వరలో డిశ్చార్జ్ అవుతా, మనీష్ సిసోడియా

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2020 | 8:56 PM

తన ఆరోగ్యం చాలావరకు మెరుగు పడిందని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కోవిడ్-19 కి గురైన మనీష్ సిసోడియా..

ఆరోగ్యం మెరుగు పడింది, త్వరలో డిశ్చార్జ్ అవుతా, మనీష్ సిసోడియా
Follow us on

తన ఆరోగ్యం చాలావరకు మెరుగు పడిందని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కోవిడ్-19 కి గురైన మనీష్ సిసోడియా కు డాక్టర్లు గత శుక్రవారం ప్లాస్మా థెరపీ చికిత్స చేశారు. మొదట ఆయన లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలోను, ఆ తరువాత ప్రయివేట్ హాస్పిటల్ మాక్స్ ఆసుపత్రిలోను ట్రీట్ మెంట్ పొందారు. ప్లాస్మా ట్రీట్ మెంట్ తో మనీష్ హెల్త్ లో ఎంతో మెరుగుదల కనిపించిందని డాక్టర్లు తెలిపారు.