
కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఓ రేంజ్లో వణికిస్తోంది. కంటికి కనిపించని ఓ వైరస్తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఇక మనదేశంలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు దీని బారినపడ్డాయి. అయితే ప్రస్తుత ఈ కరోనా మహమ్మారి నుంచి దేశంలో రెండు రాష్ట్రాలు సురక్షితంగా బయటపడ్డాయి. అందులో ఒకటి మణిపూర్ కాగా.. మరొకటి గోవా రాష్ట్రం. కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి. తమ రాష్ట్రంలో కరోనా సోకిన ఇద్దరు బాధితులు పూర్తిగా కోలుకున్నట్లు మణిపూర్ సీఎం బిరేందర్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులేవీ లేవంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమ దగ్గర వైద్య సిబ్బందితో పాటు.. రాష్ట్ర ప్రజల సహకారంతోనే దీనిని సాధించినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ కూడా కఠినంగా అమలు చేయడం మరో కారణమని తెలిపారు.
I am glad to share that Manipur is now Corona free.Both patients hv fully recovered and have tested negative.There are no fresh cases of the virus in the state.This has been possible because of cooperation of public &medical staff and strict enforcement of lockdown @PMOIndia
— N.Biren Singh (@NBirenSingh) April 19, 2020
ఇక గోవా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకుంది. రాష్ట్రంలో కరోనా సోకిన ఏడుగురు రోగులు కోలుకున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఏప్రిల్ 3 తర్వాత రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. కాగా. కేంద్ర ప్రభుత్వానుసారం.. మే 3 వరకు లాక్డౌన్ విధిగా అమలు చేస్తామన్నారు.
Chief Minister @DrPramodPSawant congratulates the medical team for successfully treating the #COVID19 cases in Goa.#GoaFightsCOVID19 #IndiaFightsCOVID19 pic.twitter.com/BBrQIwLaJA
— CMO Goa (@goacm) April 19, 2020
కాగా..అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కరోనా సోకిన వారంతా కోలుకున్నట్లు తెలుస్తోంది.