హిందుపురంలో వెరైటీ లాక్‌డౌన్

|

Apr 04, 2020 | 11:31 AM

వ్యాక్సిన్ లేని వైర‌స్‌ను అరిక‌ట్టాలంటే సామాజిక దూరం ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు అనేక విధాలుగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆక‌తాయిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ..య‌ద్దేచ్చ‌గా బ‌య‌ట‌తిరిగేస్తున్నారు. అలాంటి వారికి త‌గిన బుద్ది చెప్పేందుకు పోలీసులు రూట్ మార్చారు.

హిందుపురంలో వెరైటీ లాక్‌డౌన్
Follow us on
దేశంలో క‌రోనా ర‌క్క‌సి విరుచుకుప‌డుతోంది. దావాన‌లంలా విస్త‌రిస్తోన్న మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. ప్ర‌జ‌లేవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు, పోలీసులు ప‌దేప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు వంటివి కొనుగోలు చేసేందుకు కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల వ‌ద్ద‌కే స‌రుకులు స‌ప్లై చేస్తున్నారు.
వ్యాక్సిన్ లేని వైర‌స్‌ను అరిక‌ట్టాలంటే సామాజిక దూరం ఒక్క‌టేన‌ని ప్ర‌జ‌ల‌కు అనేక విధాలుగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ  కొంద‌రు ఆక‌తాయిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ..య‌ద్దేచ్చ‌గా బ‌య‌ట‌తిరిగేస్తున్నారు. అలాంటి వారికి త‌గిన బుద్ది చెప్పేందుకు పోలీసులు రూట్ మార్చారు. లాక్‌డౌన్‌ను ప‌క్క‌గా అమ‌లు చేసేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. మ‌రింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయిన‌ప్ప‌టికీ ప్రజలు పట్టించుకోకపోవటంతో అధికారులు రూటు మార్చారు. ఇళ్లకు తాళాలు వేసి జనాలు బయటకు రాకుండా చేస్తున్నారు. కేవలం ఉదయం, సాయంత్రం తాగునీరు, పాలు, ఇతర నిత్యావసరాలు అవసరమైనవారికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
లేపాక్షిలో ఎవరైన నిబంధనలను అతిక్రమించి వీధుల్లోకి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు చిలమత్తూరులోనూ ఇలాగే ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జనాలు నిబంధనల్ని పట్టించుకోవడం లేదని.. వైరస్ వ్యాప్తి ఉందని చెప్పినా వినడం లేదని.. అందుకే ఇలా తాళాలు వేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.