నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. అటు […]
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు.
మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. అటు మద్యం ధరలను 25 శాతం పెంచుతున్నామని వెల్లడించిన రాజత్ భార్గవ్.. లిక్కర్ సేల్స్ తగ్గించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు మద్యం షాపుల వద్ద ప్రజలు తప్పనిసరి కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్క్ ధరించాలని వెల్లడించారు. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని.. రద్దీ మరీ ఎక్కువగా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేస్తామన్నారు. ఇక మాస్క్ లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదన్నారు. అంతేకాకుండా బార్లు ఎట్టి పరిస్థతుల్లోనూ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు.
Read More:
జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..