ప్రముఖులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు ఈ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అలాగే ఆదివారం కేంద్రమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్, కర్నాటక సీఎం యెడియూరప్పలకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా పేర్కొన్నారు. కర్నాటక సీఎంకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.
ఈ పరీక్షల్లో యెడియూరప్ప కుమర్తెకి ఈ వైరస్ సోకినట్లు రిపోర్టుల్లో తేలింది. దీంతో ఆమెను బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా సీఎం యెడియూరప్ప సైతం అదే హాస్పిటల్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎం ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక సీఎం కుమార్తెకు కూడా కరోనా సోకడంతో.. ఇటీవల తనని కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని లేదా హోం ఐసోలేషన్లో ఉండాలని యెడియూరప్ప ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Karnataka CM BS Yediyurappa’s daughter has tested positive for #COVID19. She has been admitted to the hospital: Manipal Hospital, Bengaluru
— ANI (@ANI) August 3, 2020
Read More:
ప్రియమైన సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలుః సీఎం జగన్
ప్రపంచంపై కరోనా టెర్రర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు