Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది… అప్రమత్తమైన అధికారులు… ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం….

బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది... అప్రమత్తమైన అధికారులు... ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం....

Edited By:

Updated on: Dec 25, 2020 | 8:17 AM

బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ 24 మందిలో కడప జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురిని, ప్రొద్దుటూరుకు చెందిన నలుగురిని గుర్తించినట్లు సమాచారం. మిగితా ప్రయాణికుల వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

 

Follow Us