Coronavirus: దేశంలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. మరణాలు మాత్రం పైపైకి.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..

|

Feb 10, 2022 | 10:26 AM

India Covid Report: మూడో వేవ్ అంటూ ముచ్చెమటలు పట్టించిన కరోనా (Covid 19) మహమ్మారి శాంతిస్తోంది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గిపోయాయి.

Coronavirus: దేశంలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు.. మరణాలు మాత్రం పైపైకి.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..
Follow us on

India Covid Report: మూడో వేవ్ అంటూ ముచ్చెమటలు పట్టించిన కరోనా (Covid 19) మహమ్మారి శాంతిస్తోంది. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గిపోయాయి. అయితే మరణాల సంఖ్య (Covid Deaths) మాత్రం రోజురోజుకు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,24,78,060 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 7,90,789 కరోనాయాక్టివ్ కేసులున్నాయి. అలాగే దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 96.62 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 1,241 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,06,520 కు చేరింది.

కాగా నిన్న 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి మొత్తం కరోనా రికవరీ ల సంఖ్య 4,11,80,751 కు చేరింది. కాగా కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,44,382 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,71,28,19,947 టీకా డోసులు వేసినట్లు పేర్కొంది. కాగా ప్రపంచంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐదు లక్షల మందికి పైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన మూడో దేశంగా భార‌త్ నిలిచింది.

Also Read:Khiladi: సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘ఖిలాడి’.. రవితేజ సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Numaish 2022: మళ్లీ ప్రారంభం కానున్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌!.. ఎప్పటి నుంచంటే..

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..