India Corona: కరోనాతో గత 24 గంటల్లో 108 మంది మృతి.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

|

Feb 11, 2021 | 10:23 AM

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో బుధవారం..

India Corona: కరోనాతో గత 24 గంటల్లో 108 మంది మృతి.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Follow us on

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో బుధవారం 12,923 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 108 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,55,360 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. కరోనా నుంచి నిన్న 11,764 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,73,372 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,42,562 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.26 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది.

వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ..
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. గురువారం ఉదయం వరకు 70,17,114 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో ఎర్రచందనం స్వాధీనం.. ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని అరెస్ట్

Earthquake: మిజోరంలోని చంపాయ్‌లో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం.. హింద్‌కుష్ పర్వతాల్లో కూడా..