AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్…స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలపై నీలినీడలు..కేంద్రం కీలక నిర్ణయం

కోవిడ్-19 తీవ్ర ప్రభావం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపై పడింది. కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోదీ తో సహా మంత్రులు, వీవీఐపీలు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది  అంతా ఆగస్టు 15 వరకు..

కరోనా ఎఫెక్ట్...స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలపై నీలినీడలు..కేంద్రం కీలక నిర్ణయం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 5:49 PM

Share

కోవిడ్-19 తీవ్ర ప్రభావం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపై పడింది. కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోదీ తో సహా మంత్రులు, వీవీఐపీలు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది  అంతా ఆగస్టు 15 వరకు క్వారంటైన్ కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఢిల్లీ పోలీస్ ఇలా అందరూ తమ డ్రైవర్లు, కుక్స్, పరేడ్ ట్రెయినర్లతో బాటు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి క్వారంటైన్ లో ఉండాలని కేంద్రం సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు నోటిమాటగా ఈ సూచనలు చేశారట. ఆ రోజున ఎర్రకోట వద్ద పరేడ్ లో పాల్గొనే ప్రతివాహనాన్నీ శానిటైజ్ చేస్తుండాలని  కూడా ఆదేశాలు జారీ అయినట్టు చెబుతున్నారు. అలాగే ఆగస్టు 15 న రెడ్ ఫోర్ట్ కు చేరాలనుకునే ప్రజలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్ఛు .ఇండియన్ ఆర్మీ ఈ ప్రీ  ప్లాన్ ని  రూపొందించింది.