లాక్ డౌన్ బేఖాతర్.. వేల సంఖ్యలో జాతరకు పోటెత్తిన జనం..

|

May 16, 2020 | 3:39 PM

దేశంలో కరోనా తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్ ధరించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్‌ను కట్టుదిట్టమైన నిబంధనలతో అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో గ్రామదేవతకు జాతర నిర్వహించారు. ఇక ఈ ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అమ్మోరును దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి భక్తులు ఈ జాతరకు రావడం విశేషం. అమ్మోరు […]

లాక్ డౌన్ బేఖాతర్.. వేల సంఖ్యలో జాతరకు పోటెత్తిన జనం..
Follow us on

దేశంలో కరోనా తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్ ధరించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్‌ను కట్టుదిట్టమైన నిబంధనలతో అమలు చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో గ్రామదేవతకు జాతర నిర్వహించారు. ఇక ఈ ఉత్సవానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అమ్మోరును దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి భక్తులు ఈ జాతరకు రావడం విశేషం. అమ్మోరు దయతో తమ గ్రామానికి కరోనా మహమ్మారి సోకదని గ్రామస్తులు అంటున్నారు.

కాగా, రామనగర జిల్లా గ్రీన్‌జోన్‌లో ఉండటం వల్ల అధికారులు కోలగొండనహళ్లి గ్రామంలో ఈ జాతర జరుపుకునేందుకు అంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే గ్రామస్తులు ఆ ఆంక్షలను సైతం పట్టించుకోకుండా జాతర వైభవంగా జరుపుకున్నారు. దీనితో జిల్లా అధికార యంత్రాగంలో ఈ ఘటన కలకలం రేపింది. కాగా, కర్ణాటక ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..

ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

జర జాగ్రత్త.. మొబైల్ ఫోన్లతో కరోనా వ్యాప్తి.!

విజయ్‌తో కలిసి సినిమా చేయాలిః అమైరా

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక నిర్ణయం.. తేలేది ఆ రోజే!