టీ20 ప్రపంచకప్పై ఐసీసీ కీలక నిర్ణయం.. తేలేది ఆ రోజే!
కరోనా మహమ్మారి కారణంగా అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై అనిశ్చితి ఏర్పడింది. దీనితో ఈ నెల 28న ఐసీసీ బోర్డు సమావేశమై ఈ టోర్నమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం కావడంతో.. ఇప్పుడు దీనిపై సందిగ్దత నెలకొంది. అటు నవంబర్- డిసెంబర్లలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ […]
కరోనా మహమ్మారి కారణంగా అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై అనిశ్చితి ఏర్పడింది. దీనితో ఈ నెల 28న ఐసీసీ బోర్డు సమావేశమై ఈ టోర్నమెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం కావడంతో.. ఇప్పుడు దీనిపై సందిగ్దత నెలకొంది. అటు నవంబర్- డిసెంబర్లలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ విషయంపై కూడా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇక ఇప్పటికే టెస్టు సిరీస్ సాధ్యం కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. ఇలా అయితే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు టీ20 ప్రపంచకప్ను ఫిబ్రవరి-మార్చి 2021కి వాయిదా వేసే అవకాశం లేదని.. అప్పుడు మహిళల వన్డే ప్రపంచకప్ ఉందని బోర్డు సభ్యుడు ఒకరు వివరించారు. దీని బట్టి చూస్తే పురుషుల టీ20 ప్రపంచకప్ 2022కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి అసలు మే 28న ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది.!
Read More:
ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..
భారత్కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..
లాక్డౌన్ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్యర్థులకు ఊరట..
కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్లో 85 వేల కేసులు..
కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..
లాక్ డౌన్ 4.0.. రెడ్ జోన్లలో కటింగ్ షాపులకు అనుమతి!
ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..
Breaking: సాయంత్రం 5 గంటలకు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్..
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..