కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలటం లేదు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా కలవరపరుస్తోంది. వరుసగా ముగ్గురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రజాప్రతినిధులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు తాజాగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. నారాయణ రెడ్డికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఒళ్ళు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.