కరోనాకి చెక్..ఇండియాలో వెల్లువెత్తిన పీపీఈ కిట్ల ఉత్పత్తి

దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటినుంచి ఈ రెండు నెలల్లో పీపీఈ కిట్ల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ ఉత్పత్తి రోజుకు 4.5  లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. వీటి తయారీ కోసం 600 కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. రెండు నెలలకు ముందు దేశంలో ఒక్క కిట్ కూడా తయారయ్యేది కాదని, వీటిని దిగుమతి చేసుకునేవారమని ఆమె అన్నారు. రెండు వారాల్లో ఈ కిట్ల తయారీ రెట్టింపు […]

కరోనాకి చెక్..ఇండియాలో వెల్లువెత్తిన పీపీఈ కిట్ల ఉత్పత్తి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 12:13 PM

దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటినుంచి ఈ రెండు నెలల్లో పీపీఈ కిట్ల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ ఉత్పత్తి రోజుకు 4.5  లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. వీటి తయారీ కోసం 600 కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. రెండు నెలలకు ముందు దేశంలో ఒక్క కిట్ కూడా తయారయ్యేది కాదని, వీటిని దిగుమతి చేసుకునేవారమని ఆమె అన్నారు. రెండు వారాల్లో ఈ కిట్ల తయారీ రెట్టింపు అయిందన్నారు. ఈ నెల 5 న రోజుకు 2.06 లక్షల కిట్లు తయారయ్యేవి. ఇవాళ్టికి ఇది 4.5 లక్షలకు చేరినట్టు ఆమె వెల్లడించారు. ఈ కిట్స్ లో ఒక మాస్క్, ఐ షీల్డ్, షూ కవర్, గౌన్, గ్లోవ్స్ ఉంటాయి. సుమారు 15 రోజుల క్రితం వరకు దాదాపు 52 కంపెనీలు మాత్రమే వీటిని ఉత్పత్తి చేసేవి. 2.2 కోట్ల కిట్ల కోసం తాము ఆర్డర్ చేసినట్టు ఈ నెల మొదటివారంలో కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 80 లక్షల కిట్లను దిగుమతి చేసుకుంటున్నట్టు పేర్కొంది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు