కరోనా పేషెంట్ ఆత్మహత్య
ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Gsl ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య..
ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Gsl ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు రాజమండ్రిలోని తుమ్మలోవకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అధికారులు. ఆస్పత్రి నిర్లక్ష్యం వాళ్లే ఆత్మహత్యకు కారణం అంటూ ఆరోపిస్తున్నారు బంధువులు. కాగా ప్రస్తుతం జరిగిన ఈ ఘటనతో అక్కడి కరోనా పేషెంట్లను మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో మృతుల సంఖ్య 2906కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనాను జయించారు.
Read More: