ముంబైలో భూ ప్రకపంనలు…

|

Jun 17, 2020 | 2:49 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భూకంపం క‌ల‌వ‌ర‌పెట్టింది. అసలే కరోనా భయంతో వణికిపోతున్న ప్రజలకు ఇప్పుడు భూ ప్రకంపనలు మరింత వనికించాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భూ ప్రకంపనలు న‌మోద‌య్యాయి.

ముంబైలో భూ ప్రకపంనలు...
Follow us on

నార్త్ ఇండియాను భూప్రకంపనలు వణికిస్తున్నాయి. గత 15 రోజుల్లో జమ్ముకశ్మీర్‌, హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌, నోయిడాలోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. తాజాగా మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. అసలే కరోనాతో వణికిపోతున్న ముంబైవాసులను భూ ప్రకపంనలు మరింత వణికిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఉదయం 11.51గంటలకు భూ కంపించింది. ఈ తీవ్రత భూకంప లేఖినిపై 2.5గా తీవ్రత నమోదయ్యింది. ఉత్తర ముంబైకి 103 కిలోమీటర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉన్నదని సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది.

ఈ నెల 14, 15 తేదీల్లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రెండు సార్లు భూమి కంపించింది. ఆదివారం రాత్రి 5.5 తీవ్రతతో భూకంపం రాగా, సోమవారం 4.4 తీవ్రతతో భూమి కంపించింది.