AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 4 నుంచి మద్యం షాపులు ఓపెన్.!

లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ లభించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్, మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ సిద్దమైంది. ఒకవేళ తెరిస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది. కోవిడ్ […]

మే 4 నుంచి మద్యం షాపులు ఓపెన్.!
Ravi Kiran
|

Updated on: May 01, 2020 | 2:59 PM

Share

లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ లభించింది. దేశవ్యాప్త లాక్ డౌన్ ముగిసిన అనంతరం లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మే 4 నుంచి మాల్స్, మద్యం దుకాణాలను తెరిచేందుకు ఎడియూరప్ప సర్కార్ సిద్దమైంది. ఒకవేళ తెరిస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయనుంది.

కోవిడ్ 19 కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కమర్షియల్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్‌ను పునః ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. అయితే లాక్ డౌన్‌ను కొనసాగిస్తారా.. లేదా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన తర్వాతే దీనిపై ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్లు కర్ణాటక సీఎం ఎడియూరప్ప స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే రెడ్ జోన్లు మినహాయించి మిగతా ప్రాంతాల్లో కర్ణాటక సర్కార్ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారం జరిగిన కేబినేట్ మీటింగ్‌లో రాష్ట్ర ఆదాయం కోసం లిక్కర్ షాపులు తెరవాలని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. అటు ప్రజా రవాణా మాత్రం మే 15 వరకు బంద్ కానున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

Read This: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు.. వివరాలు ఇవే..