కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ
కంటికి కనిపించకుండా.. వేల మందిని పొట్టన పెట్టుకుంటోంది కరోనా. ప్రస్తుతం ఈ మాట వింటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తర్వాత కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం...
కంటికి కనిపించకుండా.. వేల మందిని పొట్టన పెట్టుకుంటోంది కరోనా. ప్రస్తుతం ఈ మాట వింటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తర్వాత కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తోంది. మందే లేని ఈ మహమ్మారిని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అన్న ప్రశ్నకు.. సమాధానం దొరకడం లేదు. అందులోనూ అమెరికా, న్యూయార్క్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోజుకు వందల్లో మరణిస్తుంటే.. వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రోజుకో కొత్త నియమాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ నమోదైన కేసుల్లో 68 శాతం పురుషులు, 32 శాతం మంది మహిళలు ఉన్నారన్నారని అక్కడి వైద్యులు తెలుపుతున్నారు. మృతుల్లో అత్యధికులు పురుషులే. అందులోనూ వైరస్ బారిన పడుతున్నవారిలో స్మోకింగ్ అలవాటున్న వారే ఎక్కువని అక్కడి వైద్యులు పేర్కొనడం గమనార్హం. వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ మంది చనిపోతున్నారంటే అది మన పొరపాటే. ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందులున్న కరోనా పేషెంట్లలో 25-30 సంవత్సరాల వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వయసుతో పని లేకుండా రోగనిరోధక శక్తి సన్నగల్లిన్న వారిలో అత్యధికులు బాధితులవుతున్నారు.
అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. భారత్లో నిబంధనలను అధిక శాతం పాటిస్తున్నారు. అదే వారికి శ్రీరామరక్ష. అదే న్యూయార్క్తో పాటు అమెరికాలోని కొన్ని నగరాల్లో పరిస్థితిని చూస్తుంటే వీళ్లకు ప్రాణాలపై ప్రేమ లేదా? అన్న ఆవేదన కలుగుతోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
క్వారంటైన్ కేంద్రంలో గర్భిణి ప్రసవం
ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు
ఫ్లాష్న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్డౌన్
జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?