AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్డేట్.. దేశంలో ఒక్క రోజులోనే 909 కేసులు, 34 మరణాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 909 కేసులు, 34 మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 8356 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 7,367 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 716 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 273కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. […]

కరోనా అప్డేట్.. దేశంలో ఒక్క రోజులోనే 909 కేసులు, 34 మరణాలు
Ravi Kiran
|

Updated on: Apr 12, 2020 | 9:24 AM

Share

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా 909 కేసులు, 34 మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 8356 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 7,367 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 716 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 273కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-381, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 11, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 29, బీహార్ – 63, ఛండీగర్-19, ఛత్తీస్‌ఘడ్‌-18, ఢిల్లీ-1069, గోవా-7, గుజరాత్-432, హర్యానా-177, హిమాచల్‌ప్రదేశ్-32, జమ్ముకశ్మీర్-207, జార్ఖండ్ – 17, కర్ణాటక- 214, కేరళ-364, లడాక్-15, మధ్యప్రదేశ్‌-532, మహారాష్ట్ర-1761, మణిపూర్‌-2, మిజోరం- 1, ఒడిశా – 50, పుదుచ్చేరి -7, పంజాబ్-151, రాజస్థాన్-700, తమిళనాడు-969, తెలంగాణ-504, త్రిపుర – 2, ఉత్తరాఖండ్ – 35, యూపీ-452, పశ్చిమ బెంగాల్-134 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(127)లో సంభవించగా.. ఆ తర్వాత మధ్యప్రదేశ్(36), గుజరాత్(22), ఢిల్లీ(19), పంజాబ్(11) రాష్ట్రాలు ఉన్నాయి.

ఇది చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా మాస్కులు పంపిణీ..

Follow Us