మే 17 వరకు లాక్‌డౌన్‌ 3.0.. వీటికి అనుమతి లేదు…

|

May 01, 2020 | 8:15 PM

అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇంతకముందు దేశంలో ఉన్న అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా కేంద్రం విభజన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హోంశాఖ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే మే 17 వరకు […]

మే 17 వరకు లాక్‌డౌన్‌ 3.0.. వీటికి అనుమతి లేదు...
Follow us on

అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇంతకముందు దేశంలో ఉన్న అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా కేంద్రం విభజన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హోంశాఖ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే మే 17 వరకు జోన్లతో సంబంధం లేకుండా కొన్ని సర్వీసులు మూసి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • ఎయిర్, మెట్రో, ట్రైన్ సర్వీసులు బంద్
  • రోడ్డు మార్గంలో రాష్ట్రం దాటి వెళ్ళడం నిషేధం
  • స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఆతిధ్య సేవలన్ని కూడా బంద్
  • సామూహిక ప్రార్ధనలు నిషేధం.
  •  జనసందోహ ప్రదేశాలైన సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నీ కూడా మూసి ఉంటాయి.

Read This: ఈ జోన్లలో బస్సులకు, వైన్ షాపులకు అనుమతి…