AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!

వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి  పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మారలేదు. ఆంక్షలు ఇలా తొలిగాయో లేదో.. అలా మళ్లీ తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. […]

ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2020 | 9:14 PM

Share

వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి  పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మారలేదు. ఆంక్షలు ఇలా తొలిగాయో లేదో.. అలా మళ్లీ తమ పైత్యాన్ని చూపిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న డ్రాగన్ కంట్రీ ప్రజలు.. అంత ప్రాణ నష్టం జరిగినా ఏం మారలేదు. ఇష్టానుసార ఆహార శైలితో ప్రపంచాన్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్న వారు.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా.. నెలల తరువాత లాక్‌డౌన్‌కు ఇటీవలే స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంత జీవనం గడపొచ్చని అక్కడి ప్రభుత్వం ప్రజలకు చెప్పేసింది. దీంతో చైనా ప్రజలు సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని నెలలుగా చప్పబడిన నాలుకను టేస్ట్ చేసుకోవాలనుకున్నారు. తాజాగా సౌత్‌ వెస్ట్‌ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు క్యూలు కట్టారు. దానికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద దర్శనమిచ్చాయి. వీటికి సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మారరా ఇక.. వీళ్లు చచ్చినా బాగుపడరు. చైనా నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఎదురుచూస్తాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: కరోనాను జయించిన ప్రధాని భార్య..!