తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఒక్కరోజే..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య నాలుగు వందలకు చేరువలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసులు 644కు చేరాయి. మంగళవారం ఒక్కరోజే.. 52 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవాళ కరోనా బారిన పడి ఒకరు మృతి […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదివేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య నాలుగు వందలకు చేరువలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కరోనా పాజిటివ్ కేసులు 644కు చేరాయి. మంగళవారం ఒక్కరోజే.. 52 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవాళ కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి వల్ల మొత్తం 18 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 516 యాక్టివ్ కేసులు ఉన్నాయని… 110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. ఇక లాక్డౌన్ దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.