AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం.. మృతుల సంఖ్య చూస్తే షాక్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏకంగా వారం రోజుల లోపే 25వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే.. ఈ వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి మరణించిన వారి సంఖ్య 75వేలు దాటింది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఇక ఈ వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉంది. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో […]

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం.. మృతుల సంఖ్య చూస్తే షాక్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 9:50 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏకంగా వారం రోజుల లోపే 25వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే.. ఈ వైరస్ ఎంతలా విజృంభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి మరణించిన వారి సంఖ్య 75వేలు దాటింది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఇక ఈ వైరస్‌ బారినపడ్డ వారి సంఖ్య 13 లక్షలకు పైగా ఉంది. ఇటలీ, స్పెయిన్, అమెరికాలో ఈ వైరస్ ప్రభావం విపరీతంగా ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో అత్యధికంగా 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. స్పెయిన్‌లో 13 వేలు దాటింది. ఇక అమెరికాలో 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఫ్రాన్స్‌లో8 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.