AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ […]

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?
Ravi Kiran
|

Updated on: Apr 15, 2020 | 10:56 PM

Share

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’ డ్రగ్ కరోనాపై ప్రభావం చూపగలదని ఆయన అన్నారు. గిలియడ్ సైన్స్ ఇంక్ సంస్థ తయారు చేసిన ఈ ప్రయోగాత్మక మందు ప్రారంభ దశలో మంచి రిజల్ట్స్ చూపిస్తోందన్నారు. అటు వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లలో ఇద్దరికీ ఈ ‘రెమెడెసివర్‌’ డ్రగ్ పని చేసినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ ఓ నివేదికను ప్రచురించిందని గంగాఖేడ్కర్ తెలిపారు.

“ఎబోలా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’.. కోవిడ్ -19 వైరస్ మ్యుటేషన్‌పై పని చేస్తోంది. అందువల్లే పరిశోధకులు ఈ డ్రగ్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.” అయితే ఇది క్లినికల్ ట్రయిల్ కాదని.. కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్ ఇచ్చిన కొందరి వ్యక్తులను పరిశీలించగా.. 68 శాతం.. లేదా ముగ్గురులో ఇద్దరు పేషంట్లకు ఈ మందు తర్వాత వెంటిలేటర్ సాయం అవసరం లేదని తేలింది. కాగా, గిలియడ్ సంస్థ తయారు చేసిన ఈ డ్రగ్ ట్రయిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్ కూడా పాల్గొంటోంది. భారత్‌లో ప్రస్తుతం ఈ రెమెడెసివర్‌ అందుబాటులో లేదని ఐసీఎంఆర్ చెప్పింది. ఏదైనా ఫార్మా సంస్థ దీనిని తయారు చేస్తే చికిత్సకు వాడొచ్చని వెల్లడించింది.

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు