AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ […]

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?
Ravi Kiran
|

Updated on: Apr 15, 2020 | 10:56 PM

Share

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’ డ్రగ్ కరోనాపై ప్రభావం చూపగలదని ఆయన అన్నారు. గిలియడ్ సైన్స్ ఇంక్ సంస్థ తయారు చేసిన ఈ ప్రయోగాత్మక మందు ప్రారంభ దశలో మంచి రిజల్ట్స్ చూపిస్తోందన్నారు. అటు వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లలో ఇద్దరికీ ఈ ‘రెమెడెసివర్‌’ డ్రగ్ పని చేసినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ ఓ నివేదికను ప్రచురించిందని గంగాఖేడ్కర్ తెలిపారు.

“ఎబోలా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’.. కోవిడ్ -19 వైరస్ మ్యుటేషన్‌పై పని చేస్తోంది. అందువల్లే పరిశోధకులు ఈ డ్రగ్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.” అయితే ఇది క్లినికల్ ట్రయిల్ కాదని.. కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్ ఇచ్చిన కొందరి వ్యక్తులను పరిశీలించగా.. 68 శాతం.. లేదా ముగ్గురులో ఇద్దరు పేషంట్లకు ఈ మందు తర్వాత వెంటిలేటర్ సాయం అవసరం లేదని తేలింది. కాగా, గిలియడ్ సంస్థ తయారు చేసిన ఈ డ్రగ్ ట్రయిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్ కూడా పాల్గొంటోంది. భారత్‌లో ప్రస్తుతం ఈ రెమెడెసివర్‌ అందుబాటులో లేదని ఐసీఎంఆర్ చెప్పింది. ఏదైనా ఫార్మా సంస్థ దీనిని తయారు చేస్తే చికిత్సకు వాడొచ్చని వెల్లడించింది.

Follow Us
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ మచ్చలు వస్తే జాగ్రత్త
అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ మచ్చలు వస్తే జాగ్రత్త
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!