ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా వైరస్ కలకలం రేపింది. స్థానిక జయంతిపేటకు చెందిన దంపతులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అనుమానంతో గత రెండు రోజుల క్రితం చీరాల ప్రభుత్వ వైద్య శాల డాక్టర్లు పరిశీలించారు. అనంతరం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ పరీక్షించటంతో దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి కుటుంబంలోని ఆరుగురిని కూడా ఆస్పత్రికి తరలించి కరోనా టెస్టులు చేశారు. చీరాలలో పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని కంటోన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు సైతం నిషేధం విధించారు.