AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఏపీలో మరో ఇద్దరికి పాజిటివ్.. మొత్తం బాధితుల సంఖ్య ఎంతంటే..!

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఈ రెండు కొత్త కేసులు నమోదు కాగా.. దీంతో రాష్ట్రంలోని బాధితుల సంఖ్య 21కు చేరింది. లండన్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికీ కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. ఇవి రెండు లోకల్ కాంటాక్ట్ కేసులుగా నమోదు కాగా.. వీటితో దేశం మొత్తం మీద కాంటాక్ట్ కేసుల సంఖ్య 8కు చేరింది. కాగా కరోనా విస్తరణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను మరింత […]

Breaking: ఏపీలో మరో ఇద్దరికి పాజిటివ్.. మొత్తం బాధితుల సంఖ్య ఎంతంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2020 | 9:41 PM

Share

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఈ రెండు కొత్త కేసులు నమోదు కాగా.. దీంతో రాష్ట్రంలోని బాధితుల సంఖ్య 21కు చేరింది. లండన్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికీ కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. ఇవి రెండు లోకల్ కాంటాక్ట్ కేసులుగా నమోదు కాగా.. వీటితో దేశం మొత్తం మీద కాంటాక్ట్ కేసుల సంఖ్య 8కు చేరింది. కాగా కరోనా విస్తరణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయబోతోంది. నిత్యావసరాల కోసం ఉదయం గం.6ల నుంచి గం.11 వరకు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతించనున్నారు. ఆ తరువాత బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసి.. 1,024కు చేరింది. మృతుల సంఖ్య 27కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read This Story Also: ప్రపంచమంతా అల్లకల్లోలం.. అయినా మారని చైనా తీరు.. మళ్లీ మొదలెట్టేశారు..!