ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు గ్రామాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14 తరువాత దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ముగుస్తుందని.. బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. గత నాలుగు రోజులుగా ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లను వెబ్సైట్లో ఉంచారు. 15 నుంచి 20వ తేదీ వరకూ ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. దీంతో.. ఊళ్లల్లో ఇరుక్కుపోయిన జనం భారీగా రిజర్వేషన్లు చేసుకున్నారు. ఈ ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.
అలాగే కరోనా కారణంగా దూర ప్రాంతాలకు కాకుండా.. ప్రస్తుతతానికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో కూడా ఏసీ సర్వీసులను 90 శాతం తగ్గించి నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. కేసీఆర్ నిర్ణయంతో.. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ నేపథ్యంలో తెలంగాణలో లాక్డౌన్ కొనసాగితే… రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసి.. సంబంధింత వ్యక్తులకు పూర్తి సొమ్ము రీఫండ్ చేస్తామని ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?
గుడ్న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..
తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం
ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్
హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’
తెలంగాణలో హాట్ స్పాట్లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం