AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా పోరులో రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్‌..మ‌రోసారి భారీ విరాళం

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.

క‌రోనా పోరులో రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్‌..మ‌రోసారి భారీ విరాళం
Jyothi Gadda
|

Updated on: Apr 11, 2020 | 6:19 AM

Share

క‌రోనా పై పోరులో మేము సైతం అంటూ.. ఎంద‌రో ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. రాజ‌కీయ నేత‌లు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ సెల‌బ్రిటీలు భారీ విరాళాలు అంద‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్మ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అయితే, ఇప్పటికే పీఎం రిలీఫ్ ఫండ్ కోసం అక్ష‌య్ కుమార్ రూ. 25 కోట్లు విరాళం అందజేశారు. తాజాగా మూడు కోట్ల విరాళం ఇచ్చి  మరోసారి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. అక్ష‌య్ ఉదార స్వ‌భావానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.