క‌రోనా ఎఫెక్ట్ః 4 రోజులపాటు చెర్వుగట్టు ఆలయం మూసివేత

|

Jun 16, 2020 | 6:39 PM

లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో ఆల‌యాల‌కు ఇప్పుడిప్పుడే అనుమ‌తిస్తున్నారు. కాగా, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం మాత్రం నాలుగు రోజులపాటు మూతపడనుంది.

క‌రోనా ఎఫెక్ట్ః 4 రోజులపాటు చెర్వుగట్టు ఆలయం మూసివేత
Follow us on
లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో ఆల‌యాల‌కు ఇప్పుడిప్పుడే అనుమ‌తిస్తున్నారు. కాగా, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం మాత్రం నాలుగు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆల‌యంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తి నిలిపివేస్తున్న‌ట్లు ఆల‌య నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోలీసు అధికారులు, ఆలయ నిర్వాహాకులు మీడియా సమావేశం ఏర్పాటు వివ‌రాలు వెల్ల‌డించారు.

ప్రతి ఆమావాస్య నాడు ఆలయ దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు పోటెత్తుతారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 21న అమావాస్య వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాన్ని నిలువరించేందుకే ఆలయ మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ నాలుగు రోజులు ఘాట్‌ రోడ్డుపై పోలీసు ప‌హారా ఉంటుంద‌ని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ దర్శనానికి రావొద్దని సూచించారు. ఆ నాలుగు రోజులు ఇళ్లలోనే పూజలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల 22 తర్వాత భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాగా ఈ నాలుగు రోజులు ఆలయ పూజారులు యాధావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.