AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్లు కట్టేవారికి గుడ్ న్యూస్..కేటీఆర్ చొరవతో త‌గ్గ‌నున్న ధ‌ర‌లు

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని వ్య‌వ‌స్థ‌లు కుదేల‌య్యాయి. దిన‌స‌రి కూలీలు, కార్మికులు ఉపాధి లేక‌, చేతిలో డ‌బ్బులేక ఇబ్బందులు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొంది. ఇటువంటి త‌రుణంలో నిర్మాణ రంగం కూడా బాగా దెబ్బ‌తిన్న‌ది. దీంతో

ఇళ్లు కట్టేవారికి గుడ్ న్యూస్..కేటీఆర్ చొరవతో త‌గ్గ‌నున్న ధ‌ర‌లు
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2020 | 4:48 PM

Share

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని వ్య‌వ‌స్థ‌లు కుదేల‌య్యాయి. దిన‌స‌రి కూలీలు, కార్మికులు ఉపాధి లేక‌, చేతిలో డ‌బ్బులేక ఇబ్బందులు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొంది. ఇటువంటి త‌రుణంలో నిర్మాణ రంగం కూడా బాగా దెబ్బ‌తిన్న‌ది. దీంతో ఎక్కువ సంఖ్య‌లో నిర్మాణాలు స‌గంలోనే ఆగిపోయిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇక పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వారి సొంతింటి క‌ల క‌ల‌గానే మిగిలిపోవాల్సి వ‌స్తుందేమోన‌నే ఆవేద‌న ప్ర‌జ‌ల్లో మొద‌లైంది. ఈ క్ర‌మంలో నిర్మాణ రంగానికి ఊత‌మిచ్చేలా తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

సిమెంటు సంస్థల అధినేతలు, ప్రతినిధులతో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. నిర్మాణ రంగం ఊపందుకొనేందుకు సిమెంట్‌ ధరలను తగ్గించాలని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనలకు సిమెంట్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అయితే, సిమెంటు ధరలను ఏ మేరకు తగ్గించాలనే అంశంపై తాము చర్చించుకుంటామని వారు వెల్లడించారు. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు మంత్రులకు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలైన డబుల్ బెడ్ రూం ఇళ్లు సహా, ఇతర పథకాలకు మరో మూడేళ్లపాటు సిమెంటు బస్తా రూ.230కి ఇచ్చేలా సిమెంట్‌ సంస్థలు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.