కమల్‌ ‘కరోనా పాట’ కోసం తరలివచ్చిన తారాలోకం

ప్రముఖ హీరో కమల్ హాసన్ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతో పాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలు పాటలు వచ్చాయి. ఇప్పుడు కమల్ హాసన్ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ ఓ పాటను రాశారు. అంతేకాకుండా ఆ పాటను ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ పాటకు జిబ్రాన్ […]

కమల్‌ కరోనా పాట కోసం తరలివచ్చిన తారాలోకం

Edited By:

Updated on: Apr 23, 2020 | 10:09 PM

ప్రముఖ హీరో కమల్ హాసన్ పాడిన పాట కోసం దక్షిణాదికి చెందిన పలువురు తారలతో పాటు గాయనీగాయకులు తరలివచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ ఇప్పటికే పలు పాటలు వచ్చాయి. ఇప్పుడు కమల్ హాసన్ దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ ఓ పాటను రాశారు. అంతేకాకుండా ఆ పాటను ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ పాటకు జిబ్రాన్ సంగీతమందించారు.

ఇక ఈ పాటను కమల్‌తో పాటు ఆయన కూతురు శ్రుతి హాసన్, దేవీశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, అనిరుధ్, బొంబాయి జయశ్రీ, శంకర్ మహదేవన్, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, ఆండ్రియా తదితరులు ఆలపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం