కరోనా ఐడియా : ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా..

| Edited By: Pardhasaradhi Peri

Jun 16, 2020 | 10:55 AM

మద్యం షాపు యజమాని టెక్నిక్ చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు....

కరోనా ఐడియా : ఆనంద్ మహీంద్రా ట్వీట్ చూశారా..
Follow us on

కరోనా పుణ్యమా అని ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి తోచిన తరహాలో వారు భౌతిక దూరం నిబంధన పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో డబ్బులు, వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి రోజు వారి పనులను కూడా చాలా జాగ్రతలు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులతో సోషల్ డిస్టెన్స్‌ను పాటించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న కొత్త టెక్నిక్‌ను ఆనంద్ మహీంద్రాను తెగ ఆకట్టుకుంది.

మద్యం షాపులో మద్యం అమ్మేందకు కొత్త పద్దతిని ఏర్పాటు చేసుకున్నాడు యజమాని. దాదాపు 5 అడుగుల పొడవుండే పెద్ద పైపును ఏర్పాటు చేశాడు. ఆ పైపులోకి తాడు కట్టి ఉన్న ఓ బాటిల్‌ను అమర్చాడు. బాటిల్ దాని అంతట అదే జారి  కస్టమర్ వైపు చివరకు వెళ్లిపోతుంది. అవసరమైనప్పుడు తాడు సాయంతో దాన్ని తిరిగి వెనక్కు తీసుకోవచ్చు. ఇక మద్యం కొనుగోలు చేయాలనుకున్న వారు ముందుగా ఆ బాటిల్ లో డబ్బులు పెడితే.. యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా బాటిల్ ను వెనక్కు లాగి అందులోని డబ్బు తీసుకుంటాడు. ఆ తరువాత కస్టమర్ కోరిన మద్యాన్ని ఆ గొట్టంలోకి జారవిడిస్తే.. అది వినియోగదారుడి చేతిలోకి వచ్చిపడుతుంది.

మద్యం షాపు యజమాని టెక్నిక్ చూసి ఫిదా అయ్యారు ఆనంద్ మహీంద్రా. ఈ ఐడియాను మరింత నవీకరిస్తే బాగుంటుందని ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తుల్లో బ్లూటూత్ ఆధారంగా ఈ ఐడియాను మరింత అభివ‌ృద్ధి చేస్తారేమో అని అన్నారు.