AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త…

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు.

అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త...
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 1:56 PM

Share

భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం అమర్‌నాథ్ యాత్రకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జులై 21న మొదలై ఆగస్టు 3 ముగుస్తుందని తెలిపింది. కేవలం ఉత్తర కశ్మీర్‌లో బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి ఇచ్చింది. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గంను మూసివేసినట్లుగా తెలిపింది.

2019లోనూ అమర్‌నాథ్ యాత్రను అర్ధాంతరంగా ముగించిన విషయం తెలిసిందే. తాజా మార్గదర్శకాల ప్రకారం సాధువులు మినహా 55 ఏళ్లు దాటినవారికి యాత్రకు అనుమతి లేదు. యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలి. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించింది.

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు.