ఈ టైంలో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే..

| Edited By:

Jul 01, 2020 | 6:34 PM

'అందాల రాక్షసి' చిత్రంతో నటుడిగా పరిచమైన నవీన్ చంద్ర.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. తాజాగా 'భానుమతి రామకృష్ణ' చిత్రంలో...

ఈ టైంలో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే..
Follow us on

‘అందాల రాక్షసి’ చిత్రంతో నటుడిగా పరిచమైన నవీన్ చంద్ర.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ‘భానుమతి రామకృష్ణ’ చిత్రంలో నటించాడు నవీన్ చంద్ర. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సలోని లూథ్రా హీరోయిన్‌గా నటించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ‘ఆహా’ డిజిటల్ యాప్‌లో జూలై 3న ప్రసారం కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నవీన్ చంద్ర పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజానికి మా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనతో చేయలేదు. థియేటర్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. థియేటర్‌లో జనాల మధ్య కూర్చొని చూస్తే ఆ ఫీలింగే వేరు. ఓ పండగలా ఉంటుంది.

కానీ దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఏమీ బాగోలేదు. థియేటర్లు కూడా ఇప్పట్లో తెరుచునేలా కనిపించడం లేదు. అయినా ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే మార్గం.

కాగా కరోనా వల్ల బాగా ఎఫెక్ట్ పడిన రంగంలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి కృషి చేస్తున్నాయి. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి. లాక్‌డౌన్ కారణంగా నేను కూడా ఇంటిలోనే ఉంటున్నాను. అంతేకాకుండా కొత్త విషయాలను కూడా నేర్చుకుంటున్నా. వార్తలను కూడా ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు హీరో నవీన్ చంద్ర.

Read More: 

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..