పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..
'పెళ్లి చూపులు' ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తనపై ఆన్లైన్లో ట్రోలింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా తరుణ్ భాస్కర్ మలయాళ సినిమా 'కప్పేలా'ను చూసిన తరుణ్ భాస్కర్....
‘పెళ్లి చూపులు’ ఫేమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తనపై ఆన్లైన్లో ట్రోలింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా తరుణ్ భాస్కర్ మలయాళ సినిమా ‘కప్పేలా’ను చూసిన తరుణ్ భాస్కర్.. ఆ చిత్రం చాలా బావుందంటూ మెచ్చుకున్నాడు. హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు, అనవసరపు సన్నివేశాలు లేవు అంటూ పెద్ద పోస్ట్ చేశాడు.
కాగా ఈ పోస్ట్పై కొందరి హీరోల ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో తరుణ్ భాస్కర్ చేసి పోస్ట్ను ట్యాగ్ చేస్తూ.. వరుసగా కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా అసభ్య పదజాలం కూడా వాడుతుండటంతో.. తరుణ్ భాస్కర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనను తిట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనని వేధించిన వారి ఫోన్ నెంబర్స్, ఐడీలు సైబర్ క్రైమ్ పోలీసులకు అందించాడు. కాగా గచ్చిబౌలి పోలీసులు తన ఫిర్యాదుని స్వీకరించినట్టు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తెలిపాడు. తన ఫిర్యాదుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు తరుణ్ భాస్కర్.
To whomsoever it may concern…@hydcitypolice pic.twitter.com/MX5GXfMVX0
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) July 1, 2020
Read More:
ఆ షూటింగ్ చివరి రోజే మహేష్ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..