Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Vaccine: తెలంగాణలో ఆయా జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్లు.. ఏ జిల్లాకు ఎన్ని డోసులంటే..

Telangana Corona Vaccine: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రానే వచ్చేసింది. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు...

Telangana Corona Vaccine: తెలంగాణలో ఆయా జిల్లాకు చేరిన కరోనా వ్యాక్సిన్లు.. ఏ జిల్లాకు ఎన్ని డోసులంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2021 | 9:15 PM

Telangana Corona Vaccine: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రానే వచ్చేసింది. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్‌ తయారీలో తీవ్ర స్థాయిలో కృషి చేశాయి. తాజాగా దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే పుణే నుంచి వ్యాక్సిన్లు దేశంలోని ఆయా రాష్ట్రాలకు చేరాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆయా జిల్లాలకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్లు చేరాయి. కొన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సిన్లు చేరగా, మిగితా జిల్లాలకు గురువారం వ్యాక్సిన్‌లను తరలించనున్నారు అధికారులు.

ఏ జిల్లాకు ఎన్ని వ్యాక్సిన్లు

– రాజన్న సిరిసిల్ల జిల్లాకు 128 వాయిల్స్, 1280 డోసులు.

– మహబూబ్ నగర్ జిల్లాకు 173 వాయిల్స్,1730 డోసులు.

– నాగర్ కర్నూలు జిల్లాకు 23 వాయిల్స్, 230 డోసులు.

– వనపర్తి జిల్లాకు 66 వాయిల్స్, 660 డోసులు.

– గద్వాల్ జిల్లాకు 88 వాయిల్స్, 880 డోసులు.

– వరంగల్ జిల్లా అర్బన్ జిల్లాకు 264 వాయిల్స్, 2640 డోసులు.

– వరంగల్ రూరల్ జిల్లాకు 58 వాయిల్స్, 580 డోసులు.

– జనగాం జిల్లాకు 83 వాయిల్స్, 830 డోసులు.

– మహబూబాబాద్ జిల్లాకు 172 వాయిల్స్, 1720 డోసులు.

– యాదాద్రి జిల్లాకు 116 వాయిల్స్, 1160 డోసులు.

– నల్గొండ జిల్లాకు 128 వాయిల్స్, 1280 డోసులు.

– మెదక్ జిల్లాకు 79 వాయిల్స్,790 డోసులు.

– సంగారెడ్డి జిల్లాకు 78 వాయిల్స్, 780 డోసులు.

– హైదరాబాద్ (1)కు 1200 వాయిల్స్, 12000 డోసులు.

– హైదరాబాద్( 2) 1807 వాయిల్స్, 18070 డోసులు.

– సూర్యాపేట జిల్లాకు 47 వాయిల్స్, 470 డోసులు.

– వికారాబాద్ జిల్లా 46 వాయిల్స్, 460 డోసులు.

– సిద్దిపేట్ జిల్లాకు 179 వాయిల్స్, 1790 డోసులు.

కాగా, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, జిల్లా వైద్య అధికారులు గురువారం వ్యాక్సిన్ డోసులు తీసుకెళ్లనున్నారు. అయితే 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Also Read:

Covid Vaccine: తెలంగాణలో మొదటి టీకా వేసేది వారికే..16వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించనున్న మంత్రి.

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల తర్వాతే దాని ప్రభావం మొదలవుతుంది: కేంద్ర ఆరోగ్యశాఖ