AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: టీఎస్‌‌పీఎస్‌సీ బోర్డు నుంచి మరో సభ్యురాలు ఔట్‌.. గవర్నర్‌కు అందిన రాజీనామా

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం (జనవరి 27) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్‌లో సాధించిన విజయాలు, కమిసణ్‌ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత..

TSPSC: టీఎస్‌‌పీఎస్‌సీ బోర్డు నుంచి మరో సభ్యురాలు ఔట్‌.. గవర్నర్‌కు అందిన రాజీనామా
TSPSC member Arunakumari resigned
Srilakshmi C
|

Updated on: Jan 28, 2024 | 8:44 AM

Share

హైదరాబాద్‌, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం (జనవరి 27) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్‌లో సాధించిన విజయాలు, కమిసణ్‌ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత చేశారు. టీఎస్‌పీఎస్సీ వరుస పేపర్‌ లీకేజీలో ప్రత్యేక్షంగానీ, పరోక్షంగానీ సభ్యులెవరికీ ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

తోటి సభ్యులందరూ రాజీనామాలు చేస్తున్నా తాను చేయలేదని, తనకు ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, భూభారతి సర్వే డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చానన్నారు. ఏ తప్పూ చేయనప్పుడు తాను టీఎస్‌పీఎస్సీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అందుకే తన పదవికి రాజీనామా చేయలేదని లేఖలో తెలిపారు. తన ఒక్కరి వల్ల ప్రభుత్వం చేపడుతోన్న కొత్త ఉద్యోగాల ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు భావించి, తన వల్ల ఎవరికీ అన్యాయం జరగొద్దనే తానిప్పుడు రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో తెలిపారు.

కాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. గత గురువారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నుంచి ఆయన ఛార్జ్‌ తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డులో మొత్తం 11 సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా వీటిల్లో చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులను తాజాగా నియమించారు. తాజాగా కోట్ల అరుణకుమారి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితోపాటు సుమిత్రా ఆనంద్‌ తనోబా రాజీనామాను కూడా గవర్నర్‌ ఆమోదిస్తే 11 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఉంటారు. వీరిద్దరి స్థానాలను కలిపి ఆరుగురు సభ్యులను నియమించాల్సి ఉంటుంది. రెండు రోజుల క్రితం టీఎస్ పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, అమీరుల్లాఖాన్, నర్రీ యాదయ్య, వై.రాంమోహన్ రావు, పాల్వాయి రజనీకుమారిలను రేవంత్ రెడ్డిని సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్, సభ్యుల రాకతో అనూహ్యంగా అరుణ కుమారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!