హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు శుక్రవారం రాత్రి (మార్చి 1) వెల్లడించింది. కాగా టీజీటీ పోస్టులకు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలకు ఎంపిక చేశారు. వారందరికీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసిన బోర్డు తాజాగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్ధుల జాబితాను సబ్జెక్టుల వారీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
గురుకుల టీజీటీ మ్యాథమెటిక్స్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ ఫిజికల్ సైన్స్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ బయోలాజికల్ సైన్స్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ తెలుగు ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ ఉర్దూ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ సైన్స్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ సంస్కృతం ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గురుకుల టీజీటీ సోషల్ స్టడీస్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.