ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు..’మెరిట్‌లేని విద్యార్ధులకు సీట్లు ఇస్తే భారీ జరిమానా’

|

Nov 06, 2022 | 5:58 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మెరిట్ లేని విద్యార్ధులకు బీ కేటగిరీ కింది అడ్మిషన్లు ఇస్తే ఒక్కోసీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ శనివారం..

ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు..మెరిట్‌లేని విద్యార్ధులకు సీట్లు ఇస్తే భారీ జరిమానా
telangana engineering admissions
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మెరిట్ లేని విద్యార్ధులకు బీ కేటగిరీ కింది అడ్మిషన్లు ఇస్తే ఒక్కోసీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ శనివారం (నవంబర్‌ 5) హెచ్చరికలు జారీ చేసింది. మెరిట్‌ విద్యార్ధులను పక్కనపెట్టి ఇతర విద్యార్ధులకు సీట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే ఇప్పటికే ప్రకటించిన ఫీజులకు బదులుగా అదనంగా ఫీజులు వసూలు చేస్తే విద్యార్ధికి రూ.2 లక్షల చొప్పు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫీజుల విషయమై అక్టోబరు 18వ తేదీన కాలేజీల పరంగా ట్యూషన్‌ ఫీజును నిర్ణయిస్తూ ప్రభుత్వం జీఓ 37ను జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా బీ కేటగిరీ సీట్లు కేటాయించడానికి తమ దరఖాస్తులను స్వీకరించడంలేదని కొందరు విద్యార్థులు టీఏఎఫ్‌ఆర్‌సీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత విద్యామండలితో చర్చించి, ఆయా కాలేజీలకు అర్హుల జాబితాలను పంపించింది. మెరిట్‌ లేకుండా ప్రవేశాలు జరిగిన విద్యార్థులను తొలగించి ఆ స్థానంలో టీఏఎఫ్‌ఆర్‌సీ పంపిన జాబితా నుంచి ఎంపిక చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో మెరిట్‌ ప్రకారంగా సీట్లను భర్తీ చేశారో లేదో పరిశీలిస్తామని, అవకతవకలకు పాల్పడ్డారని తేలితే అలాంటి ఒక్కో సీటుకు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.