AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School holiday on July 10: దంచికొడుతున్న వానలు.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ఆ రాష్ట్రాలు!

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరదలు, రహదారులపై నీటిమునిగిపోవడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం వంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి..

School holiday on July 10: దంచికొడుతున్న వానలు.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ఆ రాష్ట్రాలు!
School Holiday On July 10
Srilakshmi C
|

Updated on: Jul 09, 2026 | 9:06 PM

Share

నైరుతి రుతుపవనాల ప్రభావం ఆలస్యంగా కనబడుతుంది. దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రుతుపవన వర్షాలు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. భారత వాతావరణ శాఖ (IMD) జారీ చేసిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు జులై 10న సెలవు ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఈరోజు మూసివేశారు. జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. ఈ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఘజియాబాద్‌లో 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను మూసివేశారు. హత్రాస్, మధురలో 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలకు కూడా ఇదే విధమైన ముందుజాగ్రత్త మూసివేతలను ప్రకటించారు.

వరదలు, ఉప్పొంగుతున్న నదులు, బలహీన ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వం వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు తప్పనిసరి సెలవు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా శివమొగ్గ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థల మూసివేతను పొడిగించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హోసనగర్, సాగర్ తాలూకాలలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ వ్యాప్తంగా భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్‌లు ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇంకా ప్రకటించలేదు. అక్కడ విద్యా సంస్థలు యథావిధిగా పనిచేస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాలకు ఐఎమ్‌డి రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని నివాసితులను కోరింది.

Follow Us