
ఉద్యోగార్థులకు శుభవార్త. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 29 ఖాళీలను భర్తీ చేయనుంది. వాటిల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల దరఖాస్తుదారులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్లో నేరుగా జూన్ ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటఫికేషన్ కు సంబంధించిన నపూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనుంది. వాటిల్లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్ పోస్టులున్నాయి.
దరఖాస్తు చివరి తేదీ.. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 2023, జూన్ 06 చివరి తేదీ సాయంత్ర ఐదు గంటల లోపు ఆన్ లైలో దరఖాస్తు చేసుకోవాలి. పీఎఫ్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం.. దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు 500 రూపాయల దరఖాస్తు రుసుంను చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.
వయో పరిమితి.. ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 42. అయితే, వయోపరిమితి కూడా పోస్టులను బట్టి మారుతుంది. అంతే కాకుండా గిరిజనులు, గిరిజనులకు కేంద్ర నిబంధనల మేరకు వయోపరిమితిని సడలించారు.
జీతం.. పోస్టును బట్టి జీతం కూడా భిన్నంగా ఉంటుంది.గరిష్ట జీతం 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
అర్హతలు.. విద్యార్హత కూడా పోస్టుల వారీగా మారుతుంది. కానీ దరఖాస్తుదారులు బీటెక్ లేదా ఎంబీఏ డిగ్రీ కనీస విద్యార్హతగా కలిగి ఉండాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.