
న్యూఢిల్లీలోని ఢిల్లీ సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB).. 2025-26 ఏడాదికి సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ శాఖలలో, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలలో మొత్తం 2119 టీచింగ్, మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఈడీ, బీఏఈడీ, బీఎస్సీఈడీ, ఎంఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి.. పోస్టులను అనుసరించి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ విభాగాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల మైనస్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైతే లెవెల్ 2 పోస్టులకు రూ19,900 నుంచి రూ.63,200 వరకు, లెవెల్ 8 పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు ప్రతినెలా జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.