NCESS Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకి పైగా జీతం..
సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్సీఈఎస్ఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేరళలోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్ డిగ్రీ(ఫిజిక్స్/ మెటియోరాలజీ/ అట్మాస్పిరిక్ సైన్స్)/ డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 67,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 11-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..